
‘రాజ్యాంగ రక్షకుడు’ గా పేరు గాంచిన కేరళలోని ఎడ్నేర్ మఠాధిపతి స్వామి కేశవానంద భారతి గారు పరమపదించారు
47 ఏళ్ల కిందట కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఎడ్నేర్ మఠం ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను కేశవానంద భారతి అడ్డుకున్నారు. న్యాయపోరాటం చేశారు.
“కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ” గా ప్రసిద్ధి గాంచిన ఆ కేసును ఇప్పటికే అనేక ఇతర కేసుల పరిష్కారంలో ప్రాతిపదికగా తీసుకుంటుంటాయి మన న్యాయ స్థానాలు.